స్థానిక తోట పాలెం లో గల సత్య డిగ్రీ మరియు పీజీ కళాశాలలో కోచ్ శ్రీ. కె.సంతోష్ కుమార్ అధ్వర్యంలో కరాటే లో శిక్షణ పొందుతున్న విద్యార్థినీ విద్యార్థులు జిందాల్ కంపెనీ మరియు ఒకినావా స్పోర్ట్స్ కరాటే డో అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఛాంపియన్స్ కరాటే డోజో ఆధ్వర్యంలో జరిగిన ఇన్విటేషనల్ కరాటే ఛాంపియన్షిప్ 2022 లో అనేక పతకాలను పొందారు. వివరాలు క్రింది విధముగా వున్నాయి.
1. కుమారి సిహెచ్ మవితా కాటాలో బంగారు పతకం కుంటిలో రజిత పతకం
2. కుమారి సిహెచ్ దేవ శ్రీ కాటాలో రజిత పతకం కుంటిలో కాంస్య పతకం
3. కుమారి పి సాత్విక కాటాలో బంగారు పతకం
4. కుమారి వై బిందు మాధవి కాటాలో మరియు కుంటిలో రజిత పతకాలు
5. కుమారి బి నివేదిత కాటాలో మరియు కుంటిలో కాంస్య పతకాలు
6. కుమారి జె చైత్రిత కుంటిలో కాంస్య పతకము
7. కుమారి ఆర్ వైష్ణవి కుంటి మరియు కాటాలలో కాంస్య పతకాలు
8. మిస్టర్ ఎస్.కె రెహన్ సిద్ధిక్ కుంటిలో రజిత పతకం
9. మిస్టర్ నివాన్ నాథన్ కుంటిలో రజిత పతకం
10. మిస్టర్ బి శివ శ్రీహర్ష కాటాలో కాంస్యపతకము
11. మిస్టర్ ఎస్ చరణ్ కార్తికేయ యాదవ్ కుంటిలో కాంస్య పతకం
12. మిస్టర్. బి. షణ్ముఖ శ్రీకర్ కాటాలో కాంస్య పతకం
13. మిస్టర్ ఎస్ రుషికేశవ్ క్రిషన్ యాదవ్ కాటాలో కాంస్య పతకం
14. మిస్టర్ ఎస్ శ్రీకాంత్ కాటాలో కాంస్య పతకం
15. కుమారి కె భువనకృతి కాటాలో కాంస్య పతకం.
పై విద్యార్ధులు అందరూ 9 సంవత్సరముల నుండి 14 సంవత్సరంల లోపు ఉన్నవారు. వీరికి కెన్ యు రియో కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో సినీ నటుడు ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు అయినా శ్రీ కె సుమన్ గారు మరియు పలువురు క్రీడా ప్రముఖులు విజేతలకు బహుమతులను అందజేశారు ఈ సందర్భంగా సత్య కళాశాలలో ఏర్పాటు చేసిన అభినందన సభలో విద్యార్థినీ విద్యార్థులను కళాశాల సంచాలకులు డాక్టర్ ఎం శశిభూషణరావు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం వి సాయి దేవ మణి కళాశాల ఎన్సిసి ఆఫీసర్ కెప్టెన్ ఎం సత్యవేణి, అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు అభినందించారు.